శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం. ‘మిస్సైల్ మ్యాన్’గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప ప్రజ్ఞాశాలి. 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులాబ్దిన్, ఆసియామ్మ దంపతులకు కలాం జన్మించారు. రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలోనూ ఆయన నిరాండబరమైన జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శనీయంగా నిలిచారు. పదవీ కాలం పూర్తయ్యాక ఆయన ఐఐఎం షిల్లాంగ్లో అధ్యాపకుడిగా చేరారు. 2015 జూలై 27న షిల్లాంగ్ ఐఐఎంలో లెక్చర్ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు.ఆయన చెప్పిన కొన్ని అద్భుత సూక్తులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం.
మన జననం సాధారణమైనదే కావచ్చు.
కానీ, మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి.
కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు..
నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి..
నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి.
కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని.
నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే..
ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి.
కల అంటే నిద్రలో వచ్చేది కాదు..
నిద్ర పోనివ్వకుండా చేసేది.
మన జననం సాధారణమైనదే కావచ్చు.
కానీ, మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి.
కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు..
నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి..
నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి.
కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని.
నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే..
ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి.
కల అంటే నిద్రలో వచ్చేది కాదు..
నిద్ర పోనివ్వకుండా చేసేది.